You might be interested in:
మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈ. బీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది ప్రవేశ పరీక్ష తేదీ నాడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ననుసరించి ఆయా ఎం జె పి పాఠశాలల్లో లేదా బీసీ హాస్టల్ లో పరీక్ష నిర్వహించబడును.
1. పరీక్ష కొరకు అర్హత::
వయస్సు: బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు వీరు 01.09.2014 మరియు 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 12 సంవత్సరముల మించి ఉండరాదు. వీరు, 01.09.2013 మరియు 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి,
2. ఆదాయ పరిమితి::
విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.100000 లకు మించరాదు.
- పాత జిల్లాల ప్రకారము జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
> విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా 2023-24, 2024-25 చదువుతూ ఉండాలి. విద్యార్ధులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగవ తరగతి 2024 25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
3. పాఠశాలల్లో ప్రవేశం::
విద్యార్ధుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది పట్టిక ఒకటిలో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు పొందుపరచడమైనది.
4 . ప్రవేశ పరీక్ష ::
ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం) లలో 4వ తరగతి స్థాయిలో (02) రెండు గంటల వ్యవధిలో 100 మార్కులకు తెలుగు 15 ఇంగ్లీషు 25 లెక్కలు 30 పరిసరాల విజ్ఞానం 30 మార్కులలో ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.
- జవాబులను ఓఎంఆర్ షీట్ లో గుర్తించాలి.
- పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.
5. పరీక్షా కేంద్రం ::
విద్యార్థిని విద్యార్ధులకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించబడును పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టిక్కెట్ లో ఇవ్వబడును ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్ధులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును.
7. దరఖాస్తు చేయు విధానం
అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకుని సంతృప్తి చెందిన తరువాత ఏదేని ఏమెంట్ ఏపీ ఆన్లైన్ కి ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు పుట్టిన తేదీ తండ్రి సంరక్షకుని మొబైల్ నెంబరు వెళ్లి రు 100 చెల్లించిన తరువాత ఒక జర్నల్ నంబరు ఇవ్వబడుతుంది జర్నల్ నంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నంబర్ మాత్రమే.
ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఈ జనరల్ నెంబర్ను పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం కాలంలో నమోదు చేయవలెను.
గడువు
* ఆన్లైన్ దరఖాస్తును తేదీ 15.02.2025 నుండి 15.03.2025 తేదీ వరకు చేసుకోవచ్చును
- ఆన్లైన్ దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబరు ఇవ్వబడును నింపిన దరఖాస్తు నమోనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్ధి వద్ద కుల ధ్రువీకరణ సమీకృత కుల, జనన, ఆదాయం ధ్రువపత్రాలు) పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్ మొదలగు దృవపత్రాలు (ఒరిజినల్) పొంది ఉండాలి. ఒరిజినల్ దృవపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేనియెడల విద్యార్ధి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు.
> ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు గాని గురుకుల పాఠశాలకు గానీ మరియు ఈమెయిల్ ద్వారా గాని పంపిన దరఖాస్తులను పరిశీలించరు అట్టి అభ్యర్ధులను పరీక్షకు అనుమతించరు.
హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగా తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
హాల్ టికెట్లు పోస్టులో గానీ నేరుగా గానీ అభ్యర్ధులకు పంపబడవు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
-అర్హత లేని అభ్యర్ధుల దరఖాస్తులు పరిశీలించబడవు.
8. దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు
దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి.
పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
- పాఠశాల ప్రాదాన్యత క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి.
> పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి.
- దరఖాస్తును నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
> సెల్ నెంబరు వ్రాయునప్పుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన నంటరు లేదా సమీప బంధువుల నెంబరు ఇవ్వవలయును.
- దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావు లేదు. కావున దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్నీ వివరాలు సరిచూసుకోవాలి.
- ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును.
పట్టిక ఒకటి లో చూపించిన విధంగా ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్ధులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో బదిలీ చేయబడురు.
> ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం.
> నెలకు రూ 1400 లతో పౌష్టిక విలువలతో కూడిన మెనూ.
స్టూడెంట్ కిట్
- 3 జతల యూనిఫారం దుస్తులు.
> దుప్పటి మరియు జంకాన
> బూట్లు సాక్స్
> టై మరియు బెల్ట్
> నోట్ పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు
- కాస్మోటిక్ చార్జీల నిమిత్తం బాలురకు నెలకు 125 రూపాయల చొప్పున 5, 6 తరగతులు, 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 150 బాలికలకు 6, 7 వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు రూ.130 చొప్పున మరియు 8వ తరగతి ఆపై క్లాసుల పిల్లలకు నెలకు రూ.250 ల చొప్పున చెల్లించడం జరుగుతున్నది మరియు బాలురకు నెలకు రూ. 50 చొప్పున సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.
ఐదవ తరగతి ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించవచ్చును.
- సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజు వేరుశనగ చిక్కి వారానికి 6 దినములు గ్రుడ్డు రెండుసార్లు చికెన్ ఇవ్వబడును.
Download Complete Notification
0 comment