You might be interested in:
Sponsored Links
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల (GPO ) పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జీపీఓగా నామకరణం చేసింది. మొత్తం 10,924 పోస్టులను మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలవడానికి ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.
0 comment