You might be interested in:
Sponsored Links
APPSC గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 905 ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదల
ధృవపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ కోటా సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఎంపికైన వారందరికీ ధృవపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. దీంతో హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఫలితాలతోపాటు మెయిన్ పరీక్ష ఫైనల్ 'కీ'ని కూడా అధికారులు వెబ్సైట్లో పొందుపర్చారు.
0 comment