You might be interested in:
Sponsored Links
ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. "విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఉపవర్గీకరణ కింద
▪️గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్ రానుంది.
▪️గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
▪️గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది.
అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది” అని తెలిపారు.
0 comment