PTM 2.0 మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి పత్రికా ప్రకటన - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

PTM 2.0 మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి పత్రికా ప్రకటన

You might be interested in:

Sponsored Links

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో జూలై5న ఘనంగా జరగబోయే మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి సంబంధించి సన్నాహక చర్యలు చేపట్టాలని సమగ శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ వి.శ్రీనివాసరావు IAS., గారు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, ఆర్జేడీలకు, జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆర్జేడీలు తను పరిధిలో జిల్లా విద్యాశాఖాధికారులు, ఏపీసీలతో, మండల విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకుని. నిశితంగా పర్యవేక్షించాలని సమగ్ర శిక్షా రాష్ట పథక సంచాలకులు శ్రీ.బి.శ్రీనివాసరావు IAS.. కోరారు. మార్గదర్శకాలలో ముఖ్యాంశాలివీ.....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరికి నాణ్యమైన విద్యను అందించడానికి, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ అభివృద్ధిని.నిర్ధారించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని, పాఠశాల విద్యా శాఖ, సమాజ భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (RTE), జాతీయ విద్యా విధానం, 2020 (NEP) విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యల ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు.

  • పేరెంట్ -టీచర్మీటింగ్ (PTM) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక కీలక వేదికగా పనిచేస్తుంది.
  • PTMలు తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన, సామాజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి సహాయపడతాయి, అదే సమయంలో ఉపాధ్యాయులు పిల్లల ప్రయోజనం కోసం తల్లిదండ్రుల సహకారాన్ని కోరడానికి వీలు కల్పిస్తాయి.
  • ఈ సహకార ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లను (మెగా PTMలు) వేడుకగా నిర్వహించాలని సంకల్పించింది.
  • మెగా PTM తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వారధి. తద్వారా ప్రతి పిల్లవాడికి ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
  • భారతదేశంలో మొట్టమొదటిసారి డిసెంబర్ 7, 2024న జరిగిన బృహత్ కార్యక్రమం మెగాపీటీఎం. ఈ కార్యక్రమంలో 44,956 పాఠశాలల్లో 25.46 లక్షలమంది తల్లిదండ్రులు, 27,395 మంది పూర్వవిద్యార్థులు..
  • 22,200 మందిదాతలు, 36,918 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులంతా అంకితభావంతో పని చేయడం వలనే ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైంది. వారికి అభినందనలు,
  • ఈ విజయం ఆధారంగా, ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి 05.07.2025న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 (మెగా PTM 2.0) ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడుతుంది. పెద్ద ఎత్తున సమాజ భాగస్వామ్యం కావడమే ఈ గొప్ప కార్యక్రమ లక్ష్యం.
  • జూలై 5వ తేదీన 61,135 విద్యా సంస్థల్లో జరిగే 'మెగా పీటీఎం 2.0' కార్యక్రమంలో దాదాపు 2,28,21,454 మంది (74,96,228 మంది విద్యార్థులు, 3.32,770 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, తదితరులు 1,49,92,456) పాల్గొనున్నారు.

మెగా PTM 2.0 కార్యక్రమంలో....

  • ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి కార్డులను (Holistic Progress Cania) అందిస్తారు. తద్వారా ప్రతి బిడ్డ విద్యా పురోగతి తెలుసుకుంటారు.
  • ప్రధానోపాద్యాయుల ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సమావేశంలో పాఠశాల విద్యాపరమైన పనితీరు, మౌలిక సదుపాయాల లోపాలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియజేస్తారు.
  • సరదా కార్యకలాపాలు, ఆటలు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరు తల్లిదండ్రులమధ్య స్నేహ భావాన్ని పెంపొందించవచ్చు.
  • విద్యార్థుల, పాఠశాలల విజయ గాథలను ప్రశంసిస్తారు.

కార్యక్రమంలో భాగంగా

  • ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫోటో బూత్లు. డ్రీమ్ వాల్స్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్లు, ఏక్ పేడ్ మాకే నామ్ (అమ్మ పేరుతో మొక్క నాటడం) భాగంగాగిన్ పాస్పోర్ట్ ఉన్నాయి.
  • ఆసక్తిగల విద్యార్థులు మొక్కలు సరఫరా చేయడానికి నమోదు చేసుకోవడానికి రిజిస్టేషన్ల యాప్ అందుబాటులో ఉంది.
  • మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి.

Download Press Note


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE