You might be interested in:
ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు:
ఈరోజు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.
▪️51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
▪️రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది.
▪️ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైకింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలిపింది.
▪️పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది.
▪️సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
▪️గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 2,778 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
▪️అధికారిక భాష కమిషన్ పేరును 'మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్'గా మార్పునకు ఆమోదం తెలిపింది.
▪️తోట వెంకటాచలం (కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం.
▪️పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు ఆమోదం.
▪️కడప మైలవరంలో 250 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం.
▪️అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం.
▪️గుంటూరు తెదేపా కార్యాలయ భూమి లీజు కాలపరిమితి పెంపునకు ఆమోదం.
▪️చిత్తూరు సీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి, 56 కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనలకు ఆమోదం.
▪️నాలా పన్ను 4 శాతంలో 70 శాతం స్థానిక సంస్థలకు, 30 శాతం అథారిటీలకు ఇవ్వాలని ఆదేశాలు.
▪️ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
▪️మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం.
0 comment