గుడివాడలో మొట్టమొదటి IT కంపెనీ ప్రారంభం - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

గుడివాడలో మొట్టమొదటి IT కంపెనీ ప్రారంభం

You might be interested in:

Sponsored Links

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో తొలి ఐటి కంపెనీ ప్రారంభమైంది. 100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ కార్యకలాపాలను విజయదశమి రోజున ప్రారంభించింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొని, సంస్థ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు.

ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ విజయంపై... గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ ఐటీ సంస్థను తన సొంత కంపెనీగా భావించి.. విజయవంతానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. పీ4 స్ఫూర్తితో ప్రిన్స్టన్ సీఈవో రవి తన స్వగ్రామంలో ఐటీ సంస్థ నెలకొల్పడం ఆదర్శప్రాయమని తెలిపారు. ఎమ్మెల్యే రాము సహకారంతో.. గుడివాడలో ఐటీ సంస్థ నెలకొల్పానని ప్రిన్స్ టన్ సీఈవో వెల్లడించారు. న్యూజెర్సీ, కెనడా, డొమినికాలతో పాటు హైదరాబాద్, కాకినాడలో ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు.



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE