Annadatha Sukhibhava Payment Status - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

Annadatha Sukhibhava Payment Status

You might be interested in:

Sponsored Links

Annadatha Sukhibhava Payment Status: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 4వేలను, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు మొత్తం రూ.6వేలు ఏపీలోని రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈనెల 13వ తేదీన అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది.


మార్చి 13న అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. అదేరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

రైతులకు సాగు సమయంలో ఆర్థిక సాయం కింద ప్రతీయేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతల్లో రూ.20వేలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు మూడు విడతల్లో జమ చేస్తుండగా.. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14వేలను మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా మొత్తం మూడు విడతల్లో మూడు దఫాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏపీలో 46.80లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతుండగా.. దేశవ్యాప్తంగా సుమారు 10లక్షల మంది రైతులు పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. గత రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ.6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు మార్చి 13న రూ.2,808 కోట్లు జమ చేయనుంది. మొత్తం రూ.9,111 కోట్లు సాయాన్ని రైతులకు ఏపీ ప్రభుత్వం అందించినట్లు అవుతుంది.

 లింక్ ద్వారా రైతులు తమ డబ్బులు వచ్చాయా లేదా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా పథకం గురించి మరియు స్టేటస్ ఎలా చెక్ చేయాలో క్లియర్‌గా చెబుతున్నాను.

అన్నదాత సుఖీభవ పథకం – ముఖ్య సమాచారం

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
  • అర్హులైన రైతులకు ఏటా ₹20,000 వరకు పెట్టుబడి సహాయం అందుతుంది.
  • ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మరియు PM-Kisan పథకం నిధులు కలిసి DBT ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. 
  • సాధారణంగా ఈ డబ్బులు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పంపిస్తారు. 

2026 పేమెంట్ అప్డేట్

  • 3వ విడతగా ₹6,000 రైతుల ఖాతాల్లో DBT ద్వారా జమ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
  • ఇది ఫిబ్రవరి 2026 సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. 

Annadatha Sukhibhava Payment Status ఎలా చెక్ చేయాలి

1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

👉 https://annadathasukhibhava.ap.gov.in

2. Know Your Payment Status / Check Status పై క్లిక్ చేయండి.

3. Aadhaar Number లేదా Application Number ఎంటర్ చేయండి.

4. Captcha కోడ్ టైప్ చేసి Submit క్లిక్ చేయండి.

5. మీ Payment Status (Success / Pending / Failed) స్క్రీన్‌లో కనిపిస్తుంది. 

✔ Payment Success అని చూపితే 2–3 రోజుల్లో బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. 

ఆన్‌లైన్ కాకపోతే

గ్రామ/వార్డ్ సచివాలయం

రైతు సేవా కేంద్రం (RSK)

వద్ద కూడా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. 

Annadatha Sukhibha Payment Status

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE