You might be interested in:
AP Govt PRO Jobs : ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ చొప్పున నియమించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేస్తూ తాజాగా ఉత్వర్వులు జారీ చేశారు.
ఇతర ముఖ్యమైన సమాచారం:
ఇక.. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు బీఈ/ బీటెక్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే.. సంబంధిత శాఖల పనితీరుపై అవగాహన ఉండాలి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్గా, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ పోస్టులకు సంబంధించి అర్హుల్ని ఎంపిక చేస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2 నెలలపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి పనితీరును మదింపు చేస్తారు. ఏడాది కాలపరిమితితో పొరుగు సేవల ప్రాతిపదికన (ఔట్సోర్సింగ్) వీరిని ఉద్యోగాల్లో నియమిస్తారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు నెలకు రూ.50,000, సోషల్ మీడియా అసిస్టెంట్లకు నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు.
అర్హతల విషయానికొస్తే:
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి.. అలాగే సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించింది. అదే పీఆర్వోలకు కనీసం డిగ్రీ అర్హత ఉండి జర్నలిజంలో డిప్లొమా లేదా పబ్లిక్ రిలేషన్స్లో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలి. వీరిని ఔట్సోర్సింగ్ నియామక సంస్థ ఆప్కాస్ ద్వారా ఎంపిక చేస్తారు
Download Complete Notification
Do
0 comment