You might be interested in:
ధర్మవరం నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకు లకు ఉద్యోగం కల్పించే యోచనతో నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 9న ధర్మవరంలోని సిఎన్బి కళ్యాణ మండపంలో జాబ్మేళా నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను మంత్రి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న యువతీ యువకులు ఉద్యోగాల కోసం వివిధ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వారి కోసం నిర్వహించే ఈ జాబ్మేళాకు దేశంలోనే అతిపెద్దవైన దాదాపు 90 కంపెనీలను వస్తున్నాయని చెప్పారు. కావున నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
0 comment