You might be interested in:
Sponsored Links
జిల్లాలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త కె.జయలక్ష్మీ తెలిపారు.
ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఏజీసెట్-25 ప్రవేశ పరీక్షతో (ఇంగ్లిష్ మీడియం) ఎంపిక చేస్తామని వెల్లడించారు. మార్చి 6లోగా https://apbragcet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశ పరీక్ష అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటుందన్నారు
0 comment