You might be interested in:
Sponsored Links
AP: 'తల్లికి వందనం' పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. మే నెల నుంచి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామన్నారు చంద్రబాబు.
గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తుచేశారు.
ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు.
0 comment