ఆధార్‌- ఓటరు కార్డు అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఆధార్‌- ఓటరు కార్డు అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన

You might be interested in:

Sponsored Links

డీల్లీ: ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్ధాయితో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది.


ఆధార్‌- ఓటరు కార్డు అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన

ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(UIDAI), ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బిర్‌ సింగ్‌ సందు, వివేక్‌ జోషీలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్‌ కార్యదర్శి (న్యాయ మంత్రిత్వశాఖ), ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ప్రకారం.. భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అయితే, ఆధార్‌ కేవలం వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారించగలిగే పత్రం. అందువల్ల ఓటర్ల గుర్తింపు కార్డు (EPIC)ని ఆధార్‌తో అనుసంధానించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబంధనలు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇందులో భాగంగా యూఐడీఏ, ఈసీ టెక్నికల్‌ నిపుణుల మధ్య చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE