You might be interested in:
India Post Payment Bank Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ 51 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి 2025 మార్చి 21 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
నోటిఫికేషన్ ప్రకారం.. గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంలో నివాసం ఉన్న అభ్యర్థులకు ఇతరుల కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పోస్టులను ప్రారంభంలో ఒక ఏడాది కాంట్రాక్ట్ వ్యవధితో భర్తీ చేస్తారు. అనంతరం సంతృప్తికరమైన పనితీరుపై ఆధారపడి మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది ఉంటుంది. గరిష్ట కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు
వేతనం:
పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, వికలాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.150 దరఖాస్తుఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు.. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడొచ్చు.
ముఖ్యమైన సమాచారం
మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 51
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2025
0 comment