You might be interested in:
సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ
ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో పెద్దఎత్తున ‘తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు' నిర్వహించడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా లేఖ రాశారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమాల గురించి స్థానిక తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల కేంద్ర మంత్రి దృష్టికి తీసు కెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో జరిగిన సమావేశాల వివరాలు తెలుసు కున్న ధర్మేంద్ర ప్రధాన్ సీఎంకు లేఖ రాశారు. "రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్-టీచర్స్ మెగా మీటింగ్ నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన విశేషమైన విజయాన్ని అభినందిస్తున్నా. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 72 లక్షల మంది తల్లి దండ్రులు పాల్గొని 1.85 లక్షల మంది ఉపాధ్యాయులతో తమ పిల్లల విష యాలపై చర్చించడం చాలా సంతోషాన్ని కలిగించింది. పిల్లల సర్వతోముఖా భివృద్ధికి దోహదం చేస్తుంది. మీ ఈ ప్రయత్నం ఇతర రాష్ట్రాలూ అనుసరిం చడానికి ఒక నమూనాగా ఉంటుంది. ఇందులో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయం" అని ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో పేర్కొన్నారు.
0 comment