You might be interested in:
Sponsored Links
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2025 షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషనన్ను మార్చి 10న తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 12 నుంచి మే 13 వరకు కొనసాగుతుంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎడ్సెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
0 comment